భారతదేశం, మార్చి 25 -- ఇస్లామాబాద్: ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిగా అవతరించబోతోంది. ఈ మేరకు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందించారు.

మంగళవారం సాయంత్రం షెహబాజ్ షరీఫ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా.. "అమెరికా, ఇరాన్ అంగీకరిస్తే, ఈ యుద్ధానికి ముగింపు పలికేలా అర్థవంతమైన చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉంది" అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వచ్చిన గంటలోపే ట్రంప్ దానిని స్క్రీన్‌షాట్ తీసి తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేయడం విశేషం. "మేము ఇప్పటికే యుద్ధం గెలిచాం" అని గతంలో ప్రకటించిన ట్రంప్, ఇప్పుడు చర్చలకు మొగ్గు చూపడం ఒక కీలక మలుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ చర్చల కోసం ట్రంప్ తన అత్యంత నమ్మకస్తులైన ప్ర...