పసిడి పతనం: $4,000 దిగువకు చేరిన బంగారం.. మరో 10 శాతం తగ్గుతుందా?
భారతదేశం, జూన్ 26 -- గ్లోబల్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలపై ఒత్తిడి తీవ్రతరమైంది. వరుసగా నాలుగో వారంలోనూ పసిడి నష్టాల బాట పట్టింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న స్థూల ఆర్థిక సవాళ్ల కారణంగా బంగారం ధర కీలకమైన 4,000 డాలర్ల మానసిక మార్కు కంటే కిందకు పడిపోయింది.
స్పాట్ గోల్డ్ ధర 0.9 శాతం తగ్గి ఔన్స్కు 3,991.49 డాలర్లకు పరిమితమైంది. ఆగస్టు డెలివరీకి సంబంధించిన యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం క్షీణించి 4,007.30 డాలర్ల వద్ద ముగిసింది. మరోవైపు వెండి ధర కూడా 3.2 శాతం పతనమై ఔన్స్కు 56.01 డాలర్లకు చేరింది. ఈ ఏడాది జనవరి 29న నమోదైన ఆల్టైమ్ హై 5,594.82 డాలర్లతో పోలిస్తే బంగారం ధర ఏకంగా 29 శాతం మేర తగ్గింది. ఈ వారంలోనే సుమారు 4 శాతం నష్టాన్ని చవిచూసింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సుదీర్ఘ కాలం పాటు గరిష్ట స్థాయిలోనే ఉంచుతుందనే అంచనాలు మార్కెట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.