భారతదేశం, సెప్టెంబర్ 15 -- మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఒడుదొడుకుల మధ్య స్థిరంగా కొనసాగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అచితూచి వ్యవహరిస్తున్నారు.

మంగళవారం రాత్రి 9:10 గంటల సమయంలో ఎంసీఎక్స్ అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.15 శాతం పెరిగి 10 గ్రాములకు Rs.1,51,450 వద్ద ట్రేడైంది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.09 శాతం క్షీణించి కిలో రూ.2,32,480 వద్ద నమోదైంది.

అమెరికా డాలర్ ఇండెక్స్ 0.20 శాతం మేర లాభపడింది. మరోవైపు 10 ఏళ్ల అమెరికా బాండ్ ఈల్డ్స్ 5 శాతం మార్కును దాటాయి. అక్టోబర్ 2023 తర్వాత బాండ్ ఈల్డ్స్ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. డాలర్, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడంతో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి ఆకర్షణ కొంతమేర తగ్గింది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లన...