భారతదేశం, జూన్ 1 -- జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసేలా గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్,,,, ఇక్కడి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే హైదరాబాద్‌లో 'నవ నిర్మాణ సభ' నిర్వహించుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ ఎజెండాను మోస్తున్నారని. తెలంగాణపై నిరంతరం విషం కక్కుతున్నారని మంత్రి మండిపడ్డారు.

సోమవారం హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం..పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని స్పష్టం చేశారు. "తెలంగాణ ప్రజల కళ్లదృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని నాడు మాట్లాడిన పవన్ కళ్యాణ్. ఈరోజు ఇక్కడికి వచ్చి ఏ మొహం పెట్టుకొని సభ నిర్వహిస్తారు..? తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ కూడా...