భారతదేశం, జూన్ 13 -- దేశంలోని నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. ఇటీవల కాలంలో దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన పరీక్షల కుంభకోణాలు, పేపర్ లీకేజీల అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఆయన దేశవ్యాప్త విద్యార్థి సదస్సులకు శ్రీకారం చుడుతున్నారు. రాజస్థాన్‌లోని ప్రసిద్ధ కోచింగ్ హబ్ 'కోటా' వేదికగా జూన్ 17న ఈ ఉద్యమం ప్రారంభం కానుంది.

ఈ దేశవ్యాప్త ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

"పరీక్షల కుంభకోణాల వల్ల ప్రత్యక్షంగా నష్టపోయిన విద్యార్థులు, ఉద్యోగార్థులు, విద్యావేత్తలు, యువజన సంఘాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు రాహుల్ గాంధీ ఈ భారీ సదస్సులు నిర్వహిస్తున్నారు. జూన్ 17న కోటాలో ప్రారంభమయ్యే ఈ సదస్సులు, ఆ తర...