భారతదేశం, ఏప్రిల్ 3 -- ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లో జరుగుతున్న తాజా పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి పార్టీ తనను తప్పించిన తర్వాత ఆప్ యువ ఎంపీ రాఘవ్ చద్దా శుక్రవారం నాడు తొలిసారిగా మౌనం వీడారు. తనను పదవి నుంచి తొలగించడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) లో ఆయన ఒక భావోద్వేగ వీడియో సందేశాన్ని పంచుకుంటూ పార్టీ అధిష్టానంపై పరోక్షంగా ప్రశ్నల వర్షం కురిపించారు.

"పార్లమెంటులో ప్రజల సమస్యలను ప్రస్తావించడం ఏమైనా నేరమా? నేను ఏదైనా తప్పు చేశానా?" అని రాఘవ్ చద్దా ఆ వీడియోలో సూటిగా ప్రశ్నించారు. ప్రజల గొంతుకగా మారడమే తాను చేసిన తప్పా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"నాకు పార్లమెంటులో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా నేను కేవలం ప్రజా సమస్యలనే లేవనెత్తాను. కానీ ఆప్ న...