భారతదేశం, మే 1 -- డాక్టర్ కావాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థులకు కీలక సమయం ఆసన్నమైంది. మే 3న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG 2026) కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష రోజున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్టీఏ తాజాగా కఠినమైన నిబంధనలను ప్రకటించింది.

మే 3వ తేదీ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పరీక్ష జరగనుంది. అయితే, విద్యార్థులు తమ హాల్ టికెట్‌పై ఉన్న రిపోర్టింగ్ సమయం కంటే ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. గేటు మూసివేసే సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగానే బయలుదేరడం శ్రే...