భారతదేశం, మే 18 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ (CBI), ఈ కుట్ర వెనుక ఉన్న మూడు అంచెల వ్యవస్థను ఛేదించింది. కేవలం మధ్యవర్తులే కాకుండా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) లోపల ఉన్న కీలక వ్యక్తులే ఈ దందాకు తెరలేపడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ లీకేజీ కారణంగా జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నీట్ ప్రశ్నపత్రాలను రూపొందించే కమిటీ సభ్యులే ఈ పాపానికి ఒడిగట్టారు. పుణెకు చెందిన సీనియర్ బాటనీ టీచర్ మనీషా గురునాథ్ మాంధరే, లాతూర్ కు చెందిన పీవీ కులకర్ణిలను సీబీఐ అరెస్ట్ చేసింది.

వీరిద్దరినీ ఎన్టీఏ నిపుణులుగా నియమించింది. మనీషాకు బాటనీ, జువాలజీ పేపర్లకు యాక్సెస్ ఉండగా.. కులకర్ణికి కెమిస్ట్రీ పేపర్ పై పట్టు ఉంది.

ఏప్రిల్ నెలలోనే, అంటే పరీక్షకు కొన్ని...