భారతదేశం, జూలై 27 -- నీట్ లీకేజీ వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం ఒడిశా బీజేపీలో కొత్త రాజకీయ రగడను రాజేసింది. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సచిన్ రాహర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ సొంత పార్టీ నేతలకే తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ప్రధాన్ నిష్క్రమణను సమర్థిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన వెంటనే అర్చిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో జాతీయ జెండా నేపథ్యంలో ఉన్న ప్రధాన్ ఫోటోను షేర్ చేశారు. "నీట్ లీకేజీ రగడపై విద్యార్థులు భారీ ఎత్తున చేపట్టిన నిరసనల మధ్య ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు" అని అర్చిత ఆ పోస్టులో పేర్కొన్నారు.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో ప్రధాన్ కార్యాలయం నుంచి...