భారతదేశం, మే 30 -- న్యూఢిల్లీ: దేశంలో సామాన్యుడిపై ధరల భారం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బలహీనమైన రుతుపవనాలు, ఇటీవలి ఇంధన ధరల పెంపు వెరసి రాబోయే నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) పెరగవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన నెలవారీ ఆర్థిక నివేదికలో స్పష్టం చేసింది. మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకాలు ఎదురవుతుండటం దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని వివరించింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) లో సరఫరా అడ్డంకులు ఎంతకాలం కొనసాగుతాయనే అంశంపైనే భారత్ బాహ్య ముఖచిత్రం, ధరల అంచనాలు ఆధారపడి ఉన్నాయని నివేదిక తెలిపింది. "దేశీయ ధరల స్థిరత్వానికి ప్రస్తుతం హార్ముజ్ జలసంధి సంక్షోభమే అత్యంత కీలకమైన అంశం" అని ఆర్థిక శాఖ పేర్కొంది....