భారతదేశం, జూలై 1 -- తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రముఖ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు సరికొత్త రికార్డు సృష్టించారు. భారతదేశ వైద్య చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒకే రోగికి ఒకే సమయంలో ఐదు అవయవాలను అమర్చారు. అత్యంత సంక్లిష్టమైన మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

ఒకే వ్యక్తికి జీర్ణాశయం, మ్యూకస్ పొర కలిగిన చిన్నపేగు ప్రారంభ భాగం, క్లోమగ్రంథి, చిన్నపేగు, కుడి వైపు పెద్దపేగులను ఒకే విడతలో మార్పిడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాంతకమైన, అత్యంత అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉస్మానియాలో చేరారు. ఈ రోగి ప్రాణాలను కాపాడేందుకు జూన్ 29న ప్రారంభమైన ఈ శస్త్రచికిత్స సుమారు 36 గంటల పాటు నిరంతరాయంగా సాగి జూన్ 30 సాయంత్రానికి ముగిసింది. ప్రస్తుతం రోగి కోలుకుం...