భారతదేశం, సెప్టెంబర్ 15 -- ప్రస్తుత 2026 ఖరీఫ్ సీజన్‌లో దేశవ్యాప్తంగా వరి సాగు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 11 నాటికి అందిన అధికారిక డేటా ప్రకారం.. దేశంలో వరి సాగు విస్తీర్ణం 4 శాతం మేర తగ్గి 426.81 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే సమయానికి దేశంలో 443.78 లక్షల హెక్టార్లలో వరి పంట సాగవ్వడం గమనార్హం.

దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలో వర్షభావ పరిస్థితులు, వర్షపాత లేమి కారణంగా వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో తగ్గిన వరి సాగు విస్తీర్ణం వివరాలు.

కర్ణాటకలో వరి సాగు విస్తీర్ణం 4.54 లక్షల హెక్టార్లు, తెలంగాణలో 4.46 లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 1.90 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 1....