భారతదేశం, మే 23 -- చమురు కంపెనీలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. గడిచిన ఎనిమిది రోజుల్లోనే మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాయి. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై సుమారు రూపాయి వరకు భారం పెరిగింది. ఈ పెరుగుదల ప్రభావం దేశంలోని వివిధ నగరాల్లో వేర్వేరుగా కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది నగరాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి.

తాజా గణాంకాల ప్రకారం, దేశంలోని ప్రధాన నగరాల్లో కెల్లా హైదరాబాద్‌లోనే అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 112.81 వద్ద నమోదైంది. దీనికి ఏమాత్రం తీసిపోకుండా కేరళ రాజధాని తిరువనంతపురంలో రూ. 112.64 గా ఉంది. కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, డీజిల్ ధర కూడా ఈ రెండు నగరాల్లోనే రూ. 100 మార్కును దాటి సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. మరోవైపు ఢిల్లీలో పెట్రోల...