భారతదేశం, జూన్ 19 -- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) డిజిటల్ విభాగానికి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ (Initial Public Offering)కు తెరలేపింది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) వద్ద నేడు డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేయనుంది.

ఈ ఐపీఓ ద్వారా రూ.10 ముఖ విలువ కలిగిన 270 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను విక్రయించి, పెట్టుబడులను సేకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో ఎలాంటి ఆఫర్ ఫర్ సేల్ (OFS) లేదు. "ఈ ఐపీఓ ద్వారా మార్కెట్ నుండి రూ. 27,000 కోట్ల నుండి రూ. 30,000 కోట్ల వరకు నిధులు సమకూరవచ్చు" అని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఒక ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ తెలిపారు.

ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు మోర్గాన్ స్టాన్లీ, సిటీ రీసెర్చ్ విశ్లేషణల ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ మార...