భారతదేశం, జూలై 20 -- ప్రతి పూజలోనూ గంట మోగించడం ఒక సంప్రదాయం. మీరు ఏ హిందూ దేవాలయానికి వెళ్లినా.. అక్కడ ఒక గంట వేలాడుతూ కనిపిస్తుంది. దేవాలయాలలోనే కాకుండా ఇంట్లో గదిలో కూడా మనం గంటను పెడతాం. రోజూ గంట మోగించకుండా దేవునికి హారతి ఇస్తే.. ఆ పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు. పూజ సమయంలో గంట మోగించడం వలన మనకు ధార్మిక ప్రయోజనాలు, పూజ సంపూర్ణ ఫలితాలు లభిస్తాయి. స్వామివారి గదిలో మనం మోగించే గంట మనలో కాకుండా.. మనం నివసించే ప్రదేశంలో సానుకూల శక్తిని సృష్టిస్తుందనే నమ్మకం కూడా ఉంది. స్వామివారి గదిలో గంట ఉంచితే మనం పాటించాల్సిన నియమాలు ఏంటో చూద్దాం.

హిందూ గ్రంథాల ప్రకారం సరైన సమయంలో గంట కొట్టడం చాలా ముఖ్యం. మత గ్రంథాల ప్రకారం దేవతలను పూజకు ఆహ్వానించడానికి పూజ ప్రారంభంలో గంటను ఒక్కసారి మాత్రమే మోగించాలి. ఒకసారి గంట మోగించిన తర్వాత, పూజ గదిలో దేవునికి హారతి...