భారతదేశం, మార్చి 4 -- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో దుబాయ్‌లోని తన కార్యాలయాలను ఎన్విడియా తాత్కాలికంగా మూసివేసింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ మంగళవారం తెల్లవారుజామున ఉద్యోగులకు ఈమెయిల్ పంపారు. కార్యాలయాలను మూసివేస్తున్నామని, ఉద్యోగులందరూ ఇంటి నుంచే పని చేయాలని (Remote Work) ఆయన ఆదేశించారు.

"పశ్చిమాసియాలో మాకు బలమైన మూలాలు ఉన్నాయి. వేల సంఖ్యలో మన సహోద్యోగులు అక్కడ నివసిస్తున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి మన ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రత పట్ల నేను తీవ్ర ఆందోళన చెందుతున్నాను" అని జెన్సన్ హువాంగ్ తన సందేశంలో పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌లో ఎన్విడియాకు దాదాపు 6,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లోని ఉద్యోగులందరూ సురక్షితంగా ఉన్నారని, కంపెనీకి చెందిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ నిరంతరం వారితో టచ్‌లో ఉ...