భారతదేశం, ఏప్రిల్ 11 -- ఏపీలో దీపం పథకం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. పైప్డ్ నేచురల్ గ్యాస్‌కు(పీఎన్జీ) దీపం పథకం లబ్ధిదారులు మారినా.. రాయితీ సొమ్మును వారి బ్యాంకు అకౌంట్లోకి వేస్తామన్నారు. ఎల్పీజీపై కొన్ని రోజులుగా ఆందోళనలు నెలకొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

పశ్చి్మాసియా ఉద్రిక్తతల కారణంగా తలత్తిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్దతతో పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు, ఆయిల్ కంపెనీలకు సూచించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

దీపం పథకం లబ్ధిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలని చంద్రబాబు అన్నారు. దీపం పథకం లబ్ధిదారులు పీఎన్జీకి మారితే.. వారికి దీపం పథకం కింద ఇచ్చే రా...