భారతదేశం, ఆగస్టు 19 -- హైదరాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్ - డోన్ రైల్వే సెక్షన్‌లో ఉన్న దూపాడు స్టేషన్‌లో అదనపు లూప్ లైన్ పనుల నిమిత్తం నాన్-ఇంటర్లాకింగ్ పనులను దక్షిణ మధ్య రైల్వే చేపడుతోంది. ఈ పనుల కారణంగా పలు రైళ్ల సర్వీసులను రద్దు చేయడంతో పాటు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అలాగే కొన్ని రైళ్ల రాకపోకల్లో సమయ మార్పులు ఉంటాయని తెలిపారు.

ఆగస్టు 24, 25, 26 తేదీల్లో ప్రయాణాలు చేయాలనుకునే ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తగిన విధంగా తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

ట్రైన్ నెంబర్ 77207 డోన్ - కర్నూలు సిటీ ఆగస్టు 24, 25, 26 తేదీలలో రద్దు చేశారు.

రైలు సంఖ్య 77209 కర్నూలు సిటీ - నంద్యాల ఆగస్టు 24, 25, 26 తేదీల్లో ఈ రైలు కర్నూలు సిటీ - డోన్ స్టేషన...