భారతదేశం, ఏప్రిల్ 2 -- దక్షిణ మధ్య రైల్వే 2025-2026 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.21,211.92 కోట్ల అత్యధిక ఆదాయాన్ని సాధించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 3.12 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ రికార్డు స్థాయి పనితీరు.. సరకు రవాణా, ప్రయాణికుల నిరంతర వృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆదాయ పెరుగుదల దక్షిణ మధ్య రైల్వే ప్రాంతంపై సానుకూల ఆర్థిక ప్రభావాన్ని సూచిస్తుంది.

అధికారిక ప్రకటన ప్రకారం, దక్షిణ మధ్య రైల్వే జోన్ 147.87 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేయడం ద్వారా రూ. 13,835.27 కోట్లు ఆర్జించింది. బలమైన సరకు రవాణా పనితీరుతో దక్షిణ, మధ్య భారతదేశం అంతటా పరిశ్రమలు, వాణిజ్యం, సరఫరా గొలుసులకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. ఇటువంటి వృద్ధి ప్రాంతీయ వాణిజ్యం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా.

ప్రయాణికుల విభాగం నుంచి ఆకట్టు...