భారతదేశం, జూలై 24 -- హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే 'దేవశయని ఏకాదశి'కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏడాది జూలై 25, 2026 శనివారం రోజున ఈ పవిత్ర వ్రతం వచ్చింది. ఈ ఏకాదశితోనే చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు క్షీరాసాగరంలో యోగనిద్రలోకి వెళ్లే ఈ సమయం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనువైనదిగా భావిస్తారు.

ఈ వ్రత ప్రాముఖ్యత గురించి ఒకసారి ధర్మరాజు యుధిష్టరుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నించగా, బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించిన దివ్య కథను శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. సమస్త పాపాలను హరించి, మోక్షాన్ని ప్రసాదించే ఈ ఏకాదశి వెనుక ఉన్న పురాణగాథ ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం.

పురాతన కాలంలో మాంధాత అనే చక్రవర్తి భూలోకాన్ని పరిపాలించారు. ఆయన సత్యసంధుడు, ధర్మపరాణుడు, మహా ప్రతాపశాలి. తన ప్...