భారతదేశం, జూన్ 19 -- Kachiguda Murdeshwar Express : హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల డిమాండ్, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ నుంచి మురదేశ్వర్ వరకు నడుస్తున్న వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును మరింత ముందుకు పొడిగించారు. ఈ రైలును కర్ణాటకలోని కుంట వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. పర్యాటకులు, వ్యాపార వేత్తలకు ఎంతో ఉపయోగపడే ఈ పొడిగింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.

దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం... ఈ పొడిగించిన రైలు సర్వీసు జూన్ 19, శుక్రవారం నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రైలు ప్రయాణ వేగం, కేటగిరీకి సంబంధించి రైల్వే అధికారులు ఒక కీలక స్పష్టత ఇచ్చారు. రైలు నంబర్లు 12789/12790 కలిగిన ఈ కాచిగూడ - మురుడేశ్...