భారతదేశం, జూన్ 24 -- బెంగళూరు మార్గంలో ప్రయాణించే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. క్రాంతివీర సంగొల్లి రాయణ్ణ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో యార్డ్ రీమోడలింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జూలై, ఆగస్టు నెలల్లో నడిచే పలు రైలు సర్వీసులపై తీవ్ర ప్రభావం పడనుంది. సౌత్ కోస్ట్ రైల్వే విడుదల చేసిన వివరాల ప్రకారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల గుండా నడిచే రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మరికొన్ని కీలక రైళ్లను ఇతర మార్గాల్లోకి మళ్లించారు.

రైల్వే స్టేషన్ పరిధిలో ప్రీ-నాన్ ఇంటర్‌లాకింగ్ , నాన్ ఇంటర్‌లాకింగ్ (NI) పనుల నిర్వహణ కోసమే ఈ తాత్కాలిక మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే ముందే రైళ్ల తాజా షెడ్యూల్‌ను సర...