భారతదేశం, మే 6 -- ప్రాథమిక, ఉన్నత పాఠ‌శాల‌, సాంకేతిక విద్యతోపాటు వైద్య విద్య సిల‌బ‌స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, దాని ఉప‌యోగంపైన ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామని, ఈ విషయంలో తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను కోరారు.

తెలంగాణ భ‌విష్యత్తు ప్రణాళికపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జ‌రిగిన స‌మావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రఘురామ్ రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

ఏఐ వినియోగంతోపాటు మిడిల్ లెవ‌ల్ ఉద్యోగాల కల్పన కోసం స్కిల్స్ యూనివ‌ర్సిటీ, ఏటీసీల‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివ‌రించారు. స‌రైన ప‌ద్ధతిలో ఏఐని వినియోగిస్తే అంద‌రికి మేలు జ‌రుగుతుంద‌ని రాజన్...