భారతదేశం, జూలై 17 -- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు భారీ ఊరటనిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కలిసి అత్యంత పారదర్శకమైన, నగదు రహిత వైద్య సేవలను అందించే న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(NEHS) ను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్(EHCT) డీడ్‌ను ఆవిష్కరించడంతో పాటు, NEHS వెబ్ పోర్టల్‌ను, లబ్ధిదారుల డిజిటల్ హెల్త్ కార్డ్‌లను విడుదల చేశారు. ఈ నూతన ఆరోగ్య పథకం కింద లబ్ధిదారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 886 ప్రైవేట్, 114 ప్రభుత్వ ఆసుపత్రుల్లో (మొత్తం 1000 ఆసుపత్రులు) రూపాయి ఖర్చు లేకుండా నగదు రహిత చికిత్స పొందవచ్చు. ఇందులో అపోలో, యశోద, కిమ్స్, మెడికవర్, కామినేని, కాంటినెంటల్, కేర్, స్ట...