భారతదేశం, మే 26 -- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ సూపర్ న్యూస్ అందించింది. రాబోయే పండుగలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ నుంచి రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలకు (నార్త్ ఈస్ట్) మూడు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంజూరు చేసింది. గతంలో 'స్పెషల్ ట్రైన్స్'గా నడిచిన వీటిని ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

ఈ కొత్త రైలు సర్వీసులు జూలై నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రైళ్ల సమయాలు, రూట్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

గత కొంతకాలంగా ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన రైళ్లలో హైదరాబాద్ - జైపూర్, చర్లపల్లి - అగర్తలా, కాచిగూడ - శ్రీ గంగానగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి.

హైదరాబా...