భారతదేశం, జూన్ 8 -- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతకు ఈ పథకం ఒక గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. సోమవారం (జూన్ 8) ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఏకంగా 308 కోట్లకు పైగా మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు.

ఈ ఉచిత ప్రయాణాల ద్వారా తెలంగాణలోని సామాన్య, మధ్యతరగతి మహిళలకు రవాణా ఖర్చుల రూపంలో దాదాపు రూ. 10,696 కోట్ల ఆర్థిక ఊరట లభించింది. మెుత్తం మహిళల ప్రయాణాలు లెక్క వేయగా.. 308 కోట్లకుపైగా ఉన్నాయి. మహిళలు తమ దైనందిన ప్రయాణాల కోసం ఖర్చు చేసే ఈ భారీ మొత్తాన్ని పొదుపు చేసుకోగలిగారు.

ఇప్పటికే కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండగా,...