భారతదేశం, ఆగస్టు 3 -- తెలంగాణ వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉపరితల వాతావరణంలో ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల తీవ్ర ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. అక్కడికక్కడ ఈదురుగాలులతో కూడిన వానలు పడుతుండటంతో వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ, పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే 24 నుండి 48 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను తరహా మేఘాల కలయిక వల్ల ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్...