భారతదేశం, మే 25 -- తెలంగాణలో వాతావరణ పరిశీలన వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత వాతావరణ శాఖ(IMD) సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మిషన్ మౌసమ్' (Mission Mausam) ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ మౌలిక సదుపాయాలను విస్తరించాలని యోచిస్తోంది.

ఈ ప్రణాళికల ప్రకారం.. తెలంగాణలో కొత్త పరిశీలన కేంద్రాలు, డాప్లర్ వాతావరణ రాడార్లు, విండ్ ప్రొఫైలర్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పడుతుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం తెలంగాణకు అదనంగా మరో రెండు డాప్లర్ వాతావరణ రాడార్లు రానున్నాయి. వీటిలో ఒకదానిని నిజామాబాద్ సమీపంలో, మరొకదానిని హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటితోపాటు వాతావరణ అంచనాలను, గాలి వేగాన్ని మరింత కచ్చిత...