భారతదేశం, సెప్టెంబర్ 19 -- దక్షిణ మధ్య రైల్వే చేస్తున్న పనుల ప్రకారం.. రైల్వే బోర్డు ద్వారా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో సుమారు రూ.50,000 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందుపల్లి-దుగ్గిరాల మధ్య బైపాస్ లైన్‌ మాత్రమే కాదు.. 781.6 కిలోమీటర్ల బల్హర్షా-కాజీపేట-విజయవాడ-గూడూరు కారిడార్ అత్యంత ముఖ్యమైన ప్రతిపాదనలలో ఒకటి. రూ.16,800 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా వేసిన ఈ ప్రాజెక్ట్ రైల్వే బోర్డులో కీలక దశలను క్లియర్ చేసింది, పరిశీలనలో ఉంది.

బల్హర్షా-కాజీపేట, కాజీపేట-విజయవాడ సామర్థ్య పెంపుదల ప్రణాళికలో ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. ఈ రూట్‌లో సరకు రవాణా, ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. 173-కిమీ సికింద్రాబాద్-వాడి మూడు, నాల్గో లైన్ రూ.5,102 కోట్లతో మంజూరు అయింది. నెట్‌వర్క్‌లో ప్రస్తుతం ...