భారతదేశం, జూలై 13 -- తెలంగాణలో ఖరీఫ్ సాగుపై ఆందోళన నెలకొంది. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై 40 రోజులు గడిచినా, విత్తనాలు చల్లేందుకు కేవలం 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో వ్యవసాయ పనులు మందగించాయి. ఎల్ నినో ప్రభావంతో సాగు పనుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతోందని వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన క్షేత్రస్థాయి నివేదికలో స్పష్టం చేసింది.

జూలై 8వ తేదీ నాటికి రాష్ట్రంలోని సాధారణ ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో కేవలం 41.79 శాతం మాత్రమే సాగులోకి వచ్చింది. 9 జిల్లాల్లో సాగు నమోదు 20 శాతం కంటే తక్కువగా ఉండగా, మరో 16 జిల్లాల్లో 50 శాతం లోపే నమోదైంది. సమయం వేగంగా ముగిసిపోతుండటంతో సాగులో వెనకబడిన జిల్లాల్లో జూలై 15 నుండి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా తక్కువ కాలపరిమితి గల పంట రకాలను ప్రోత్సహించడం, తగి...