భారతదేశం, జూన్ 18 -- తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల(పెన్షనర్లు) ఆరోగ్య భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న "ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్" ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో నంబర్ 40 (GO 40) ను విడుదల చేశారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు మరింత మెరుగైన, పారదర్శకమైన ఉచిత వైద్య సేవలను అందించడమే ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. ఈ ట్రస్ట్‌ను సక్రమంగా నిర్వహించేందుకు గానూ మొత్తం 30 మంది సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఛైర్మన్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)

మెంబర్ సెక్రటరీ: ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) సీఈవో

మిగిలిన 28 మందిలో 17 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు, 10 మంద...