భారతదేశం, సెప్టెంబర్ 1 -- జ్యోతిష్య శాస్త్రంలో అందం, ప్రేమ, విలాసాలు, కళలు, ఐశ్వర్యానికి కారకుడిగా భావించే శుక్ర గ్రహం తన నక్షత్ర సంచారాన్ని, రాశి స్థానాన్ని మార్చుకోబోతోంది. ప్రస్తుతం కన్యారాశిలో ఉన్న శుక్రుడు.. హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 2, మధ్యాహ్నం 01:51 గంటలకు తన సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలో శుక్రుడు నవంబర్ 5 వరకు సుదీర్ఘకాలం సంచరిస్తాడు.

జ్యోతిష్య నిపుణుల ప్రకారం... శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించినప్పుడు అత్యంత శుభప్రదమైన 'మాలవ్య రాజయోగం' రూపుదిద్దుకుంటుంది. వేద జ్యోతిష్యంలో ఈ రాజయోగానికి విశేష ప్రాధాన్యత ఉంది. మాలవ్య యోగం వల్ల జాతకులకు ఆకస్మిక ధన లాభాలు, సుఖసంతోషాలు, వ్యాపారాభివృద్ధి, శ్రేయస్సు సిద్ధిస్తాయి. ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ అందించిన వివరాల ప్రకారం.. ఈ శుక్ర గోచారం వల...