భారతదేశం, జూలై 24 -- Tirumala Swami Pushkarini Closure : కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో అత్యంత పవిత్రమైన స్వామి పుష్కరిణి నీటి శ్సుద్ధి, మరమ్మతు పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సమాయత్తమవుతోంది. ప్రతి ఏటా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పుష్కరిణికి మరమ్మతులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు నెల రోజుల పాటు పుష్కరిణి మరమ్మతు పనులను చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది.

ఈ ఏడాది సెప్టెంబరు 15వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల నాటికి పుష్కరిణిని సర్వాంగ సుందరంగా, పవిత్రంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప...