భారతదేశం, ఏప్రిల్ 24 -- Tirumala Srivari Donation : కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు తమ భక్తిని చాటుకుంటూ భారీ విరాళాలు సమర్పిస్తుంటారు. తాజాగా తిరుమల శ్రీవారికి మరో భక్తురాలు భక్తితో ఖరీదైన కానుకను అందజేశారు.బెంగళూరుకు చెందిన డాక్టర్ ఎం మహాదేవమ్మ 753 గ్రాముల బరువున్న ఏడు బంగారు పతకాలను తిరుమల శ్రీవారికి కానుకగా అందజేశారు.

సుమారు 753 గ్రాముల బరువున్న 7 బంగారు పతకాలను ఆమె. తిరుమల శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.94.80 లక్షలు ఉంటుందని అంచనా.

శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన కార్యక్రమంలో దాత డాక్టర్ ఎం మహాదేవమ్మ.. ఈ బంగారు పతకాలను టీటీడీ ఉన్నతాధికారులకు అందజేశారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలు ఈ విరాళాన్ని స్వీకరించారు. స్వామివా...