భారతదేశం, సెప్టెంబర్ 11 -- కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారు అత్యంత నైవేద్య ప్రియుడు. ఏడుకొండలపైన నిత్యోత్సవం, వారోత్సవాలతో అలరారే శ్రీవారి ఆలయంలో స్వామివారికి ప్రతిరోజూ వివిధ రకాల అన్నప్రసాదాలు, పిండి వంటలు, రుచికరమైన పణ్యారాలను అత్యంత శాస్త్రోక్తంగా నివేదిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో జరిగే పూజా కైంకర్యాలకు అనుగుణంగా ఆయా సమయాల్లో ప్రత్యేకమైన ప్రసాదాలను సమర్పించడం యుగాలుగా వస్తున్న పవిత్ర ఆనవాయితీ.

తిరుమల ఆలయంలో నైవేద్యాల తయారీ అంతా ప్రాచీన వైఖానస ఆగమ సంప్రదాయాల ప్రకారం అత్యంత పవిత్రతతో జరుగుతుంది. ఆలయంలోని అత్యంత పావనమైన 'పోటు' (వంటశాల)లో అర్చకులు, పోటు సిబ్బంది మడిచారాలతో ఈ ప్రసాదాలను సిద్ధం చేస్తారు. నైవేద్య తయారీలో ఉపయోగించే పదార్థాలు, పాత్రలు, వంట చేసే విధానాలకు ఆగమ శాస్త్రంలో విశిష్ట ప్రాధాన్యం ఉంది...