భారతదేశం, జూలై 16 -- తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, సాధారణ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. ప్రయాణికుల రద్దీని నియంత్రించడంతో పాటు సౌకర్యవంతమ ప్రయాణాన్ని అందించేందుకు మహారాష్ట్రలోని హుజూర్ సాహిబ్ నాందేడ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుచానూరు మధ్య 12 ప్రత్యేక రైళ్లను (రైలు సంఖ్యలు 07603/07604) నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

ఈ ప్రత్యేక రైళ్లు 2026 జూలై 21వ తేదీ నుండి ఆగస్టు 26వ తేదీ వరకు పట్టాలెక్కనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా నడిచే ఈ రైళ్ల వల్ల ఉత్తర తెలంగాణ భక్తులతో పాటు కోస్తాంధ్ర ప్రయాణికులకు ఎంతో లబ్ధి చేకూరనుంది.

దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం నాందేడ్ - తిరుచానూరు మధ్య రెండు దిశలలో చెరో 6 సర్వీసుల చొప్పున మొత్తం 12 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టి...