భారతదేశం, మే 9 -- Tirumala Accommodation Facilities : కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. ఈ వేసవి సెలవుల వేళ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారి సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనేక వసతులను కల్పిస్తోంది. వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం వంటి సదుపాయాలను భారీ స్థాయిలో ఏర్పాటు చేసింది.

తిరుమలలో వసతి పొందాలనుకునే భక్తులు ముందుగా సీఆర్వో (CRO) జనరల్ కౌంటరును సంప్రదించాలి. అక్కడ మీ ఫోన్ నంబర్, గుర్తింపు కార్డు వివరాలను నమోదు చేసుకోవాలి. గది కేటాయించబడగానే.. ఆ గది నంబరు, ఏ ప్రాంతంలో ఉంది అనే వివరాలు మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి. అనంతరం సంబంధిత ఉప విచారణ కార్యాలయంలో డిజిటల్ పద్ధతిలో (UPI/Card) చెల్లింప...