ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం: ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు
భారతదేశం, మే 14 -- దేశ రాజధాని ఢిల్లీలో పాలన ఇకపై కొత్త పుంతలు తొక్కనుంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో సాగుతున్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింటోంది. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకోవాలని, పొదుపు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందనగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగంలో అనవసర ఖర్చులకు కత్తెర వేస్తూనే, ఇంధన పొదుపు లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు వారానికి రెండు రోజుల పాటు ఇంటి నుంచే పని (Work From Home) చేయాల్సి ఉంటుంది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో సాధ్యమైనంత వరకు భౌతిక సమావేశాలకు స్వస్తి చెప్పి, ఆన్లైన్ మీటింగ్స్ నిర్వహించాలని సీఎం సూచించారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.