భారతదేశం, జూన్ 6 -- డిజిటల్ ఉద్యమం 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. జంతర్ మంతర్ వద్ద జరగబోయే నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆయన అమెరికా నుంచి భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన మద్దతుదారులకు కీలక పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా, క్రమశిక్షణతో సాగాలని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ నిరసనకు మద్దతు తెలుపుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ పోలీసులు అభిజీత్ దీప్కేను అరెస్ట్ చేస్తే, తాను ఆరు వారాల పాటు నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

ఢిల్లీలో అడుగుపెట్టిన అనంతరం అభిజీత్ దీప్కే 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. జంతర్ మంతర్ వద్ద మద్దతుదారులను కలుసుకోవడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

"నే...