భారతదేశం, మార్చి 22 -- అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రహదారి భద్రతపై అవగాహన లేకపోవడం కారణాలతో రోడ్డు ప్రమాదాలకు గణనీయంగా పెరుగుతున్నాయి. సరైన డ్రైవింగ్ నైపుణ్యాలు లేని చాలా మంది డ్రైవర్లు తమ ప్రాణాలనే కాకుండా.. రహదారిపై ఉన్న ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. భారతదేశంలో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాలలో దాదాపు 1.7 లక్షల మంది మరణిస్తున్నారు. ఒక్క తెలంగాణలోనే ఏటా సుమారు 7,500 మంది ప్రాణాలు కోల్పోతుండగా దాదాపు 23,000 మంది గాయపడుతున్నారు. ఈ గణాంకాల దృష్ట్యా రోడ్డు ప్రమాదాలు, మరణాలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రవాణా శాఖ రోడ్డు భద్రతా చర్యలను పటిష్టం చేయాలని నిర్ణయించింది.

ఈ చర్యలలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో కీలక మార్పులు చేయడానికి శాఖ ప్రణాళిక రచిస...