భారతదేశం, ఏప్రిల్ 11 -- డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో వాహనాలను స్వాధీనం చేసుకునే సమయంలో రవాణాశాఖ నిబంధనల్లోని 448ఏ పక్కాగా అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వాహనం నడుపుతున్నట్టుగా తేలితే నిబంధనల ప్రకారం.. ఆ వ్యక్తిని ప్రాసిక్యూషన్ చేయాల్సి వచ్చిందంటే.. మూడు రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేయాలని చెప్పింది.

సాయిరాం అనే వ్యక్తి మద్యం తాగి బండి నడుపుతూ పోలీసులకు దొరకగా.. వాహనాన్ని సీజ్‌ చేశారు. అయితే వాహన యజమాని విజయ్‌ హైకోర్టులో దీనిపై పిటిషన్‌ వేశారు. జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ విచారణ చేశారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం తాగి నడుపుతున్నారన్న కారణంతో వాహనాన్ని సీజ్‌ చేసే అధికారం పోలీసులకు లేదని చెప్పారు. తగిన పత్రాలు చూపితే విడుదల చేయాల్సి ఉంటుందని చెప్పారు.

ఒకవేళ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లయితే ...