భారతదేశం, జూన్ 27 -- హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులేట్ పక్కన ఉన్న రహదారికి "డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ"గా పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా గౌరవించబడిన మొదటి అమెరికా అధ్యక్షుడిని తానేనని ఆయన పేర్కొన్నారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 ఏండ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులేట్ ఆనుకుని ఉన్న రహదారికి డోనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

ఈ వారం ప్రారంభంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారతదేశంలో యూఎస్ రాయబారి సెర్గియో గోర్ సంయుక్తంగా అధికారిక నామఫలకాన్ని ఆవిష్కరించిన ఫోటోను ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేస్తూ.. 'భారతదేశంలోని హైదరాబాద్‌లో సరికొత్త డోనాల్డ్ ట్రంప్ అవె...