భారతదేశం, జూలై 21 -- వర్షాకాలం వచ్చిందంటే చాలు దేశంలో డెంగ్యూ భయం వెంటాడుతుంది. ప్రతీ ఏటా వేలాది మంది ఈ ప్రమాదకర వైరస్ బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. తీవ్రమైన ప్లేట్‌లెట్ల పతనం, ఇతర ఆరోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య రక్షణ దిశగా భారత్ ఒక కీలకమైన మైలురాయిని దాటింది. దేశంలోనే తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు నియంత్రణ సంస్థల ఆమోదం లభించింది.

జపాన్‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ 'టకేడా' తయారు చేసిన 'క్యూడెంగా' (QDENGA - TAK-003) వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతులు మంజూరు చేసింది. 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ టీకా ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది.

ఇప్పటివరకు డెంగ్యూ నివారణ అనేది కేవలం దోమల నియంత్రణ, వ్యక్తిగత జాగ్రత్తలపైనే ఆధారపడి ఉండేది. ...