భారతదేశం, ఆగస్టు 20 -- ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ నియామకాల వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తోంది. ఇదే అంశంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ చేశారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జగన్. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం తన తప్పులను ఒప్పుకోవడానికి నిరాకరిస్తూ. ప్రశ్నించిన ప్రతిసారీ ఆత్మరక్షణలో పడుతోందని ధ్వజమెత్తారు.

శాసనసభలో ఈ అంశంపై చర్చించేందుకు ఉత్సాహం చూపిన కూటమి ప్రభుత్వం. అసలు నిజాలు బయటపడ...