భారతదేశం, జనవరి 15 -- తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం ముగింపుతో గురువారం నుండి తెల్లవారుజామున సుప్రభాత సేవ తిరిగి ప్రారంభం అయింది. పవిత్రమైన ధనుర్మాసం కాలంలో రోజువారీ సుప్రభాతం స్థానంలో ఆండాళ్ తిరుప్పావై పారాయణం కొనసాగింది. డిసెంబర్ 17 నుండి జనవరి 14 వరకు పూజారులు, వేదపండితులు వెంకటేశ్వరుడిని స్తుతిస్తూ ఆండాళ్ దేవత కూర్చిన 30 పాసురాలను పారాయణం చేశారు. బుధవారం ధనుర్మాసం ఘడియలు ముగియడంతో గురువారం నుండి తిరుమల ఆలయంలో సాధారణ ఆచార షెడ్యూల్కు తిరిగి కొనసాగుతోంది. అందులో భాగంగా సుప్రభాత సేవ తిరిగి ప్రారంభమైంది.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 5.30 నుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.