భారతదేశం, మార్చి 24 -- ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజాలు జొమాటో, స్విగ్గీలు కస్టమర్లపై మరోసారి భారాన్ని మోపాయి. గత వారం జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచగా, ఇప్పుడు స్విగ్గీ కూడా అదే బాటలో నడిచింది. తాజాగా స్విగ్గీ తన ప్లాట్‌ఫామ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌పై Rs.14.99 నుండి ఏకంగా Rs.17.58కి (జీఎస్టీతో కలిపి) పెంచింది. అంటే కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే సుమారు 17 శాతం మేర భారం పెరిగింది.

కేవలం ప్లాట్‌ఫామ్ నిర్వహణ, మెయింటెనెన్స్ కోసమే ఈ రుసుమును వసూలు చేస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. ఒకప్పుడు భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షించిన ఈ సంస్థలు, ఇప్పుడు లాభాల బాట పట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితుల వల్ల ముడి చమురు, ఎల్‌పీజీ (LPG) ధరలు పెరగడం డెలివరీ వ్యయంపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ధరల ప...