భారతదేశం, సెప్టెంబర్ 3 -- ముంబై: భారతదేశపు అతిపెద్ద డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థ జెరోధాలో సాంకేతిక సమస్య తలెత్తింది. సెప్టెంబర్ 3, బుధవారం ఉదయం ట్రేడింగ్ సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే, ప్లాట్ఫామ్లో సాంకేతిక లోపం కారణంగా కొన్ని ట్రేడింగ్ యాప్స్లో ధరలు సరిగా అప్డేట్ కాలేదు. దీంతో మదుపరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
బుధవారం ఉదయం, జెరోధా ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోని 'కైట్' (Kite) యాప్లో ధరలు, ఇతర డేటా సరిగా కనిపించలేదు. ఈ సమస్య వల్ల మదుపరులు సరైన ధరల వద్ద కొనుగోలు, అమ్మకాలు జరపలేకపోయారు. దీనిపై పలువురు మదుపరులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ద్వారా ఫిర్యాదులు చేశారు.
సమస్య తీవ్రతను గుర్తించిన జెరోధా సంస్థ, వెంటనే స్పందించింది. తమ యూజర్లలో కొందరికి యాప్లో ధరల అప్డేట్లో సమస్యలు ఎదురవుతున్నాయని అధికారికంగా అంగీకరించిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.