భారతదేశం, జూన్ 4 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) పరీక్షల లీకేజీలు, అక్రమాలకు వ్యతిరేకంగా ఒక వినూత్న నిరసన ఊపందుకుంటోంది. కేవలం ఒక వ్యంగ్యంగా సోషల్ మీడియాలో ప్రారంభమై, ప్రస్తుతం యువతలో భారీ మద్దతు కూడగట్టుకున్న ఉద్యమం 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టేందుకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ సంస్థ తన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి, దేశంలోని యువతను ఈ నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన 5 ముఖ్యమైన అంశాలు ఇవే:

సీజేపీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రస్తుతం అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. ఆయన జూన్ 6 (శనివారం) ఉదయం 8 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కానున్నారు. అక్క...