భారతదేశం, జూలై 8 -- జులై నెల నుండి సెప్టెంబ‌ర్ 30వ తేది వ‌ర‌కు వివిధ ప‌ర్వదినాలు, ఉత్సవాల‌ను పుర‌స్కరించుకుని శ్రీ‌వారి ఆల‌యంలో బ్రేక్ ద‌ర్శనాలు పలు తేదీల్లో ర‌ద్దు అవుతున్నాయి. ఆ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. బ్రేక్ ద‌ర్శనాలు ర‌ద్దైన తేది వివరాలు కింది విధంగా ఉన్నాయి.

జులై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.

జులై 17న‌ ఆణివార ఆస్థానం.

జులై 19న శ్రీ ఆండ‌వ‌న్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మ‌ర్యాద‌.

జులై 29న జీయ‌ర్ స్వాముల చాతుర్మాస సంక‌ల్పం.

ఆగ‌స్టు 22న ప‌విత్రోత్సవాల‌కు అంకురార్పణ‌.

ఆగ‌స్టు 24న ప‌విత్రోత్సవాల రెండో రోజు సంద‌ర్భంగా ప‌విత్రాల స‌మ‌ర్పణ‌.

సెప్టంబ‌ర్ 8న శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.

సెప్టంబ‌ర్ 14న శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల‌కు అంకురార్పణ‌.

సెప్టంబ‌ర్ 15 నుండి 23వ తేది వ‌ర‌కు శ్రీ‌వార...