భారతదేశం, జూలై 7 -- ఏపీలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. జులై చివరిలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలో విజయనగరం కలెక్టర్ రామ్‌సుందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధులతో రామ్మోహన్ నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల కోసం లాంజ్, ఇతర ప్రాంతాలలో కల్పించిన సౌకర్యాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని చట్టపరమైన తనిఖీలు, పరీక్షలు పూర్తయ్యాయని, విమానాశ్రయం పూర్తిస్థాయి కార్యకలాపాలకు సిద్ధంగా ఉందని అధికారులు ఆయనకు వివరించారు. విమానాశ్రయానికి సులభంగా చేరుకునేందుకు అనువైన రహదారులు (అప్రోచ్ రోడ్లు), ఇతర సౌకర్యాలు కల్పించామని కలెక్టర్ మంత్రికి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2,200 ఎకరాల స్థలంలో జీఎంఆర్ గ్రూప్ సుమారు రూ.4,500 కోట్ల అంచనా వ్యయంతో ఈ...